ఒక గురువు గారి బోధనలలో విన్న సంఘటన ఇది -
ఒక మహా భక్తుడు, అమ్మవారి ఉపాసకుడు నల్లమల అరణ్య ప్రాంతం లో ఉండే వాడు. అతను అమ్మవారి పూజ చేస్తూ వంద మేకల్ని పూజలో బలి చెయ్యడానికి సిద్ధం చేసుకున్నాడు. కొన్ని మేకలను నిర్దాక్షిణ్యం గా బలి ఇచ్చిన తరువాత ఒక విచిత్ర సంఘటన జరిగింది. అతని విజ్ఞానం తో అతను జంతువుల తో సంభాషించగల నేర్పు ని కలిగి ఉన్నాడు. ఒక మేక ని బలి ఇవ్వడానికి తీసుకు వచ్చి దాని మెడ మీద కత్తి ఉంచి దాని కళ్ళలోకి చూశాడు. ఆ మేక లో అపారమైన సంతృప్తి , ఆనందం కనిపించాయి. అతనికి ఆశ్చర్యం గా అనిపించింది. 'మరి కొద్ది సేపటిలో ప్రాణం వదలబోతూ కూడా ఇంత సంతృప్తి గా ఎలా ఉండగలుగుతున్నావు ?' అని అడిగాడు.
ఆ మేక - 'అయ్యా ! కొన్ని జన్మల కింద నేను కూడా మనుష్యుడి గా ఉన్నాను. అమ్మవారి పూజ చేస్తూ, అమ్మ అనుగ్రహం కోసం తపించే వాడిని. దానిలో భాగం గానే ఒక మేక ని శక్తి పూజ లో బలి ఇచ్చాను. నా మనుష్య జన్మ వదిలిన తర్వాత నాకు నేను చేసిన పాపం ఏమిటో తెలిసింది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం గా ఇప్పటికి తొంభై తొమ్మిది సార్లు మేక జన్మ ఎత్తి ఇతర మనుష్యుల చేతిలో బలి అయ్యాను. ఇది వంద వ జన్మ. నా పాపానికి ఇక్కడితో పరిహారం అవుతుంది. నేను ఇక జన్మ రాహిత్యాన్ని పొందుతాను. అందుకే మీరు నన్ను బలి ఇవ్వబోతున్నా నాకు ఆనందం గానే ఉంది' - అని చెప్పింది.
ఇది విన్న ఈ భక్తుడు నిలువునా కదిలిపోయాడు. తాను ఇప్పటి వరకు ఎంత పాపం చేస్తూ వస్తున్నాడో అర్థం అయ్యింది. 'ఇప్పటి వరకు చేసిన పాపం చాలు. ఇక ముందు చెయ్యలేను. నేను నిన్ను బలి ఇవ్వను, కాపాడుతాను' అని పలికాడు. 'అయ్యా ! మీరు నన్ను బలి ఇస్తే నాకు మేలు చేసిన వారు అవుతారు. నా పాపానికి పూర్తి పరిహారం లభిస్తుంది. మీరు నన్ను బలి ఇచ్చి నాకు జన్మ రాహిత్యం ఇవ్వండి. నేను ఇప్పటికే చేసిన తప్పుకి కుమిలి పోతున్నాను ' అని ఆ మేక ప్రాధేయ పడింది. ఇలా వాదం ప్రతివాదం కొనసాగాక ఆ భక్తుడు చుట్టూ అడవిలో ఒక మనిషి ఎవరన్నా ఉన్నారా అని వెతికాడు. ఒక మేకల కాపరి తన కత్తి ని పదును చేసుకుంటూ కనిపించాడు.
ఆ భక్తుడు మేకల కాపరి దగ్గరికి వెళ్లి - 'ఈ మేక చాలా మహిమ కలిగినది, ఉత్తమం అయినది, ఎటువంటి కష్టం రాకుండా - చంపకుండా దీనిని కాపాడు, నీకు మేలు జరుగుతుంది ' అని చెప్పి అతనిని ఒప్పించి ఈ మేక ని అతనికి అప్పగించాడు. అప్పుడు ఆ భక్తుని మనసు తెప్పరిల్లింది. తన వలన జరిగిన పాపాలకి చింతిస్తూ అమ్మవారికి సాత్విక విధానం లో పూజ చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకుని కర్తవ్యోన్ముఖుడు అయ్యాడు.
చంపకుండా వదిలి వేయబడ్డ మేక నిరాశ గా, తన పాప పరిహారం గురించి ఆలోచిస్తూ ఆ మేకల కాపరి వెంట బయలుదేరింది. కొండల్లో కోనల్లో నడుస్తూ ఉండగా ఒక చోట మేకల కాపరి జారి పడబోయాడు. పట్టు కోసం అతను చేసిన ప్రయత్నం లో పదునైన కత్తి ఈ మేక మెడ మీద పడింది. ఒక ప్రాణం ఖరీదు ఎంతో అనుభవించి ప్రాయశ్చిత్తం పొందిన ఆ మేక ఆ జన్మ ని కూడా ముగించి అమ్మవారిలో లీనం అయ్యింది.
Swans
Little beautiful creations of God
Wednesday, July 14, 2010
Thursday, July 8, 2010
ఒక గురువు గారు చెప్పిన వాస్తవం
ఒక గురువు గారు శక్తి పూజ గురించి చెప్పిన విషయాలలో కింద సంఘటన ని కూడా వివరించారు. ఆ సంఘటన నిజమని నేను నమ్మాను. 'ఈ రోజుల్లో కూడా ఇలాంటివి జరుగుతాయా?' అని చాలా మంది సందేహ పడవచ్చు. కాని నేటికీ అమ్మ వారిని ఉపాసన చేసిన ఎంతో మందికి అమ్మవారి సాక్షాత్కారం ఏదో ఒక రూపం లో లభిస్తూనే ఉండటం నేను చూస్తున్నాను, వింటున్నాను.
నేటి ఉత్తరాంచల్ రాష్ట్రం లో ఒక మారు మూల ఉన్న గ్రామం లో 'ధారీ దేవి' గుడి ఒకటి ఉంది. అక్కడ అమ్మ వారు కళ్యాణ కారిణి గా పిలవబడుతూ పూజలు అందుకుంటున్నారు. కాళికా దేవి రాక్షస సంహారం చేశాక ఆగ్రహం చల్లారక అటు ఇటు తిరుగుతూ తనకి అడ్డు వచ్చిన ప్రతి దానిని నేలమట్టం చేస్తోంది. దేవతలంతా భయపడి అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించమని శివుడిని ప్రార్థించారు. శివుడు అమ్మ వారు వెళ్ళే మార్గం లో అడ్డుగా పడుకున్నాడు. అమ్మ వారు ఆగ్రహం తో నడుస్తూ స్వామి వారి మీద అడుగు వేశారు. అప్పుడు అమ్మవారికి ఒక్క సారిగా కోపం తగ్గింది. తను చేసిన పనికి చింతించడం మొదలుపెట్టారు. 'ఎందుకు ఇంత కోపం గా ఉన్నావ్ ?' అని శివుడు ప్రశ్నించగా 'రాక్షసులతో జరిగిన యుద్ధం లో అనంతమైన శక్తి ఉద్భవించింది. ఇంత శక్తి ని ఎలా ఉపయోగించాలో తెలియజేయమని' అమ్మవారు ప్రార్థించారు. స్వామి వారు ఈ శక్తి ని భూ లోకం లోని మన బిడ్డ ల ఆలనా-పాలనా చూడటానికి ఉపయోగించు అని చెప్పారు. అప్పుడు అమ్మవారు ఈ గుడి ఉన్న చోటనే భూ లోకం లోకి ప్రవేశించారు అని భక్తుల నమ్మకం.
దాదాపు రెండు వేల సంవత్సరం వరకు ఇక్కడ విపరీతం గా జంతు బలులు జరుగుతూ ఉండేవట. అక్కడ పూజారి తో సహా మాంసం తినే అలవాటు అందరికీ ఉండటం తో ఆ దురాచారం నిత్యం సాగుతూ వచ్చిందట. ఒక నాడు పూజ లో ఉన్న పూజారికి అమ్మవారు సాక్షాత్కరించి 'ఈ సృష్టి లోని ప్రతి జీవి నా బిడ్డడే. అమాయక ప్రాణులను నా పేరు తో బలి ఇచ్చే ఈ ఆచారాన్ని ఇక్కడితో ఆపించు. ఈ జీవ హింస ఆపకపోతే నా ఆగ్రహాన్ని చూస్తావు' అని హెచ్చరించారట.
'ఇది తరతరాల ఆచారం కదా, నేనొక్కడినే ఎలా ఆపగలను అమ్మా ' అని అతను అడిగాడట. 'నీ ముందు ఇక్కడ ఉన్న పూజారులకి కూడా నేను ఇదే హెచ్చరించాను. ఇప్పుడు నిన్ను కూడా హెచ్చరిస్తున్నాను' అని అమ్మవారు స్పష్టం చేసారట.
ఆ పూజారి గ్రామస్తుల చేత జంతు బలులు ఆపడానికి ప్రయత్నించినప్పటికీ మొదట్లో చాలా మంది ఈ విషయాన్ని నమ్మలేదు. కాని ఆ పూజారి స్వయం గా తను మాంస భక్షణ మానివేసి అందరికీ అదే ఉపదేశం చేశాక ఆ ఆలయం లో జంతు బలులు పూర్తిగా ఆగిపోయాయి.
చెడు ని చీల్చి చెండాడే వీర రూపం - అమ్మవారి కొన్ని అవతారాలలో ఉంటుంది. ప్రపంచం లో ఎంతటి రాక్షసత్వం అనాది నుంచి ఉన్నదో మనకి ఎప్పుడూ అవగతం అవుతూనే ఉంది. అప్పట్లో రాక్షసులు భీకర రూపం లో ఉండే వారని మన పురాణాలలో చెప్పి ఉన్నారు. కాని ఈ కలి కాలం లో మేక వన్నె పులుల లాంటి మనుషుల లోనే భయంకరమైన రాక్షసత్వం నిండి ఉంటోంది. డబ్బు కోసం పసి పిల్లలని కొలిమి లో బూడిద చేసే రాక్షసులు మన చుట్టూ ఉన్నారు. ఇలాంటి ప్రపంచాన్ని ఇంకా భ్రష్టు పట్టకుండా కాపాడేందుకు, అమాయక ప్రజల్ని రక్షించేందుకు కాళికా అమ్మవారిలాంటి శక్తి స్వరూపాలని ఆరాధించడం మానవాళి కి చాలా అవసరం. అయితే అంతటి శక్తి స్వరూపాన్ని నిర్మలమైన భక్తీ, మంచి ప్రవర్తన తో మాత్రమే ప్రసన్నం చేసుకోగలం.
ఊదా రంగు లేదా గాఢమైన రంగుల పుష్పాలతో అమ్మవారిని అర్చించ వచ్చు. సాత్వికమైన పూజ, ధ్యానం, ఉపచారం, సాత్విక నైవేద్యం తోనే అమ్మవారి కృప ని పొందవచ్చు. అమ్మవారికి తీపి పదార్థాన్ని నివేదించి ఆ తీపి ని నలుగురితో పంచుకోవడం మాత్రమే కాదు, అమ్మ ప్రేమ తత్వాన్ని మన చుట్టూ ఉన్న ప్రతి జీవికి ఎంతో కొంత పంచడమే - శక్తి ఆరాధన లోని ఉత్తమ లక్ష్యం.
నేటి ఉత్తరాంచల్ రాష్ట్రం లో ఒక మారు మూల ఉన్న గ్రామం లో 'ధారీ దేవి' గుడి ఒకటి ఉంది. అక్కడ అమ్మ వారు కళ్యాణ కారిణి గా పిలవబడుతూ పూజలు అందుకుంటున్నారు. కాళికా దేవి రాక్షస సంహారం చేశాక ఆగ్రహం చల్లారక అటు ఇటు తిరుగుతూ తనకి అడ్డు వచ్చిన ప్రతి దానిని నేలమట్టం చేస్తోంది. దేవతలంతా భయపడి అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించమని శివుడిని ప్రార్థించారు. శివుడు అమ్మ వారు వెళ్ళే మార్గం లో అడ్డుగా పడుకున్నాడు. అమ్మ వారు ఆగ్రహం తో నడుస్తూ స్వామి వారి మీద అడుగు వేశారు. అప్పుడు అమ్మవారికి ఒక్క సారిగా కోపం తగ్గింది. తను చేసిన పనికి చింతించడం మొదలుపెట్టారు. 'ఎందుకు ఇంత కోపం గా ఉన్నావ్ ?' అని శివుడు ప్రశ్నించగా 'రాక్షసులతో జరిగిన యుద్ధం లో అనంతమైన శక్తి ఉద్భవించింది. ఇంత శక్తి ని ఎలా ఉపయోగించాలో తెలియజేయమని' అమ్మవారు ప్రార్థించారు. స్వామి వారు ఈ శక్తి ని భూ లోకం లోని మన బిడ్డ ల ఆలనా-పాలనా చూడటానికి ఉపయోగించు అని చెప్పారు. అప్పుడు అమ్మవారు ఈ గుడి ఉన్న చోటనే భూ లోకం లోకి ప్రవేశించారు అని భక్తుల నమ్మకం.
దాదాపు రెండు వేల సంవత్సరం వరకు ఇక్కడ విపరీతం గా జంతు బలులు జరుగుతూ ఉండేవట. అక్కడ పూజారి తో సహా మాంసం తినే అలవాటు అందరికీ ఉండటం తో ఆ దురాచారం నిత్యం సాగుతూ వచ్చిందట. ఒక నాడు పూజ లో ఉన్న పూజారికి అమ్మవారు సాక్షాత్కరించి 'ఈ సృష్టి లోని ప్రతి జీవి నా బిడ్డడే. అమాయక ప్రాణులను నా పేరు తో బలి ఇచ్చే ఈ ఆచారాన్ని ఇక్కడితో ఆపించు. ఈ జీవ హింస ఆపకపోతే నా ఆగ్రహాన్ని చూస్తావు' అని హెచ్చరించారట.
'ఇది తరతరాల ఆచారం కదా, నేనొక్కడినే ఎలా ఆపగలను అమ్మా ' అని అతను అడిగాడట. 'నీ ముందు ఇక్కడ ఉన్న పూజారులకి కూడా నేను ఇదే హెచ్చరించాను. ఇప్పుడు నిన్ను కూడా హెచ్చరిస్తున్నాను' అని అమ్మవారు స్పష్టం చేసారట.
ఆ పూజారి గ్రామస్తుల చేత జంతు బలులు ఆపడానికి ప్రయత్నించినప్పటికీ మొదట్లో చాలా మంది ఈ విషయాన్ని నమ్మలేదు. కాని ఆ పూజారి స్వయం గా తను మాంస భక్షణ మానివేసి అందరికీ అదే ఉపదేశం చేశాక ఆ ఆలయం లో జంతు బలులు పూర్తిగా ఆగిపోయాయి.
చెడు ని చీల్చి చెండాడే వీర రూపం - అమ్మవారి కొన్ని అవతారాలలో ఉంటుంది. ప్రపంచం లో ఎంతటి రాక్షసత్వం అనాది నుంచి ఉన్నదో మనకి ఎప్పుడూ అవగతం అవుతూనే ఉంది. అప్పట్లో రాక్షసులు భీకర రూపం లో ఉండే వారని మన పురాణాలలో చెప్పి ఉన్నారు. కాని ఈ కలి కాలం లో మేక వన్నె పులుల లాంటి మనుషుల లోనే భయంకరమైన రాక్షసత్వం నిండి ఉంటోంది. డబ్బు కోసం పసి పిల్లలని కొలిమి లో బూడిద చేసే రాక్షసులు మన చుట్టూ ఉన్నారు. ఇలాంటి ప్రపంచాన్ని ఇంకా భ్రష్టు పట్టకుండా కాపాడేందుకు, అమాయక ప్రజల్ని రక్షించేందుకు కాళికా అమ్మవారిలాంటి శక్తి స్వరూపాలని ఆరాధించడం మానవాళి కి చాలా అవసరం. అయితే అంతటి శక్తి స్వరూపాన్ని నిర్మలమైన భక్తీ, మంచి ప్రవర్తన తో మాత్రమే ప్రసన్నం చేసుకోగలం.
ఊదా రంగు లేదా గాఢమైన రంగుల పుష్పాలతో అమ్మవారిని అర్చించ వచ్చు. సాత్వికమైన పూజ, ధ్యానం, ఉపచారం, సాత్విక నైవేద్యం తోనే అమ్మవారి కృప ని పొందవచ్చు. అమ్మవారికి తీపి పదార్థాన్ని నివేదించి ఆ తీపి ని నలుగురితో పంచుకోవడం మాత్రమే కాదు, అమ్మ ప్రేమ తత్వాన్ని మన చుట్టూ ఉన్న ప్రతి జీవికి ఎంతో కొంత పంచడమే - శక్తి ఆరాధన లోని ఉత్తమ లక్ష్యం.
దైవం దగ్గర మీ అహంకారాన్ని వదులుకోవాలి ... మూగ జీవాల ప్రాణాలని కాదు
శాక్తేయం హిందూ ధర్మం లో అతి ముఖ్యమైన పూజావిధానం. ఈ జగత్తు అంతటికీ అమ్మవారు మూలం అని విశ్వసించి ఆ అమ్మ ని శక్తి గా కొలిచే సంప్రదాయమే శాక్తేయం. హిందువులుఅతి శక్తి వంతమైన దైవాలుగా, ఈ సృష్టి ని పరిపాలించే త్రిమూర్తులు గా కొలిచే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా అమ్మ వారి ప్రేరణ తోనే ఈ లోకాలని సృష్టించి, పాలిస్తూ, లయం చేస్తున్నారనేది శాక్తేయం లోని ప్రధాన భావన.
అమ్మవారిని కొలిచే అనేక విధానాలలో - మంత్రం, తంత్రం, షోడశోపచార పూజ లాంటివి అతి ముఖ్యం అయినవి. ముఖ్యం గా తాంత్రిక విద్య అన్నిటి కన్నా ఎక్కువ గా వక్రీకరించబడిన పూజ విధానం. తాంత్రిక విద్య ని, అమ్మ వారి ఆరాధన ని జంతు బలితో ముడి పెట్టే ఆధారాలు ఏవి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో లేవు. ఒక వేళ అలాంటి ఆధారాలు ఏమన్నా ఉన్నాయని ఎవరన్నా వాదిస్తే అది ఖచ్చితం గా తప్పు గా అర్థం చేసుకోబడిన / వక్రీకరించబడిన విషయమే.
మన పురాణాల్లో కొన్ని చోట్ల మనిషి లోని అహంకారాన్ని మహిషం తో (ఎద్దు), మనిషి మనసు ని అజ తో (మేక) పోల్చారు. అహంకారాన్ని వదులుకోలేకపోయినా, మన మనసు ఎటు వెళ్ళితే మనం అటు పరుగులు తీసినా మనం నమ్మే దైవం దగ్గరికి మనం చేరలేము. మనలో ఉన్న లోపలి శత్రువులని జయించి ప్రేమ, వాత్సల్య భావనలతో మాత్రమే మనం మంచి స్థితి ని చేరుకోగలము. ఈ బోధన స్వార్ధ పరుల చేతుల్లో చివరికి మూగ జీవాలైన ఆవు, మేక ల బలికి దారి తీసి ఉండవచ్చు. ఇలాంటి అనేక బోధనలు సంకుచిత బుద్ది కలిగిన వారి చేతుల్లో కొత్త రూపం సంతరించుకున్నాయి.
అమ్మ వారు జగత్తు మొత్తాన్ని సృష్టించి, శాసించే మాతృమూర్తి - మనుషులు మాత్రమే కాదు, భూమి మీద సకల జంతు జాలాలు ఆవిడ కి బిడ్డలే. ఒక బిడ్డ తనని ఆరాధించే క్రమం లో ఇంకొక బిడ్డ ని బలి తీసుకోవడం అనేది అమ్మ ఏ మాత్రం హర్షించే విషయం కాదు. ఒక జీవి యొక్క రక్తాన్ని, మాంసాన్ని అర్పించడం ద్వారా అమ్మవారిని త్రుప్తి చెందేలా చెయ్యచ్చు అని ఎవరన్నా భావిస్తే అది కేవలం వాళ్ళ మూర్ఖత్వం.
అమాయకమైన మూగ జీవాల ప్రాణాలని శక్తి ఆరాధన పేరుతో బలిచ్చే వ్యక్తులని ఆ అమ్మవారు చాలా కఠినం గా శిక్షిస్తారు - ఏదో ఒక రూపం లో.
సమస్య అంతా మన ప్రజల ఆలోచనలో ఉంది. ప్రభుత్వం ఎన్నో ఎన్నో చట్టాలు చేసింది, చేస్తూ ఉంది. కాని హిందూ సంస్కృతి లో భాగం గా జంతు బలులని ప్రజలు ఆచరించి నంత కాలం ఈ పాపాలు ఇలా జరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి. అమ్మ వారి శక్తి గ్రామ దేవత గా మొదలుకొని, క్షేత్ర స్థాయి లో, శక్తి పీఠాలుగా జగత్తు అంతా విస్తరించి ఉంది. అజ్ఞానం తోను, అవివేకం తోను అన్ని చోట్లా ప్రజలు ఇంకా జంతు బలులని శక్తి ఆరాధన లో భాగం చేస్తూనే ఉన్నారు. వ్యక్తి స్థాయి నుంచి చైతన్య పరచడం వల్లనే ఆ దురాచారాన్ని నెమ్మదిగా మన సమాజం నుంచి తరిమి వెయ్యచ్చు. సాటి ప్రాణుల పట్ల కరుణ గా, ప్రేమ గా ఉండటమే అమ్మవారికి మనిషి చెయ్యగలిగిన ఉత్తమం అయిన ఆరాధన.
అమ్మవారిని కొలిచే అనేక విధానాలలో - మంత్రం, తంత్రం, షోడశోపచార పూజ లాంటివి అతి ముఖ్యం అయినవి. ముఖ్యం గా తాంత్రిక విద్య అన్నిటి కన్నా ఎక్కువ గా వక్రీకరించబడిన పూజ విధానం. తాంత్రిక విద్య ని, అమ్మ వారి ఆరాధన ని జంతు బలితో ముడి పెట్టే ఆధారాలు ఏవి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో లేవు. ఒక వేళ అలాంటి ఆధారాలు ఏమన్నా ఉన్నాయని ఎవరన్నా వాదిస్తే అది ఖచ్చితం గా తప్పు గా అర్థం చేసుకోబడిన / వక్రీకరించబడిన విషయమే.
మన పురాణాల్లో కొన్ని చోట్ల మనిషి లోని అహంకారాన్ని మహిషం తో (ఎద్దు), మనిషి మనసు ని అజ తో (మేక) పోల్చారు. అహంకారాన్ని వదులుకోలేకపోయినా, మన మనసు ఎటు వెళ్ళితే మనం అటు పరుగులు తీసినా మనం నమ్మే దైవం దగ్గరికి మనం చేరలేము. మనలో ఉన్న లోపలి శత్రువులని జయించి ప్రేమ, వాత్సల్య భావనలతో మాత్రమే మనం మంచి స్థితి ని చేరుకోగలము. ఈ బోధన స్వార్ధ పరుల చేతుల్లో చివరికి మూగ జీవాలైన ఆవు, మేక ల బలికి దారి తీసి ఉండవచ్చు. ఇలాంటి అనేక బోధనలు సంకుచిత బుద్ది కలిగిన వారి చేతుల్లో కొత్త రూపం సంతరించుకున్నాయి.
అమ్మ వారు జగత్తు మొత్తాన్ని సృష్టించి, శాసించే మాతృమూర్తి - మనుషులు మాత్రమే కాదు, భూమి మీద సకల జంతు జాలాలు ఆవిడ కి బిడ్డలే. ఒక బిడ్డ తనని ఆరాధించే క్రమం లో ఇంకొక బిడ్డ ని బలి తీసుకోవడం అనేది అమ్మ ఏ మాత్రం హర్షించే విషయం కాదు. ఒక జీవి యొక్క రక్తాన్ని, మాంసాన్ని అర్పించడం ద్వారా అమ్మవారిని త్రుప్తి చెందేలా చెయ్యచ్చు అని ఎవరన్నా భావిస్తే అది కేవలం వాళ్ళ మూర్ఖత్వం.
అమాయకమైన మూగ జీవాల ప్రాణాలని శక్తి ఆరాధన పేరుతో బలిచ్చే వ్యక్తులని ఆ అమ్మవారు చాలా కఠినం గా శిక్షిస్తారు - ఏదో ఒక రూపం లో.
సమస్య అంతా మన ప్రజల ఆలోచనలో ఉంది. ప్రభుత్వం ఎన్నో ఎన్నో చట్టాలు చేసింది, చేస్తూ ఉంది. కాని హిందూ సంస్కృతి లో భాగం గా జంతు బలులని ప్రజలు ఆచరించి నంత కాలం ఈ పాపాలు ఇలా జరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి. అమ్మ వారి శక్తి గ్రామ దేవత గా మొదలుకొని, క్షేత్ర స్థాయి లో, శక్తి పీఠాలుగా జగత్తు అంతా విస్తరించి ఉంది. అజ్ఞానం తోను, అవివేకం తోను అన్ని చోట్లా ప్రజలు ఇంకా జంతు బలులని శక్తి ఆరాధన లో భాగం చేస్తూనే ఉన్నారు. వ్యక్తి స్థాయి నుంచి చైతన్య పరచడం వల్లనే ఆ దురాచారాన్ని నెమ్మదిగా మన సమాజం నుంచి తరిమి వెయ్యచ్చు. సాటి ప్రాణుల పట్ల కరుణ గా, ప్రేమ గా ఉండటమే అమ్మవారికి మనిషి చెయ్యగలిగిన ఉత్తమం అయిన ఆరాధన.
Wednesday, July 7, 2010
మన ధర్మం జంతు బలిని కోరుకోదు
ప్రేమ, పాప పుణ్యాల మీద విశ్వాసం, సాటి ప్రాణి పట్ల జాలి, దయ - ఇవే మన హిందూ ధర్మానికి మూలాధారాలు. ఈ మూలాలని విస్మరించిన వ్యక్తులకి, అలాంటి వ్యక్తులు అనుసరించే మార్గానికి ఎప్పటికీ ధర్మ బద్ధత లేనట్టే !
దురదృష్టం కొద్దీ, హిందూ ధర్మం లో చెప్పబడిన అంశాలు చాలా వరకు తప్పు గా అర్థం చేసుకోబడ్డాయి లేదా స్వార్ధ పరుల చేతుల్లో అవి వక్రీకరించ బడ్డాయి. వాటి ఫలితమే మనం ఈ నాటికీ అతి సాధారణం గా చూస్తున్న జంతు బలులు. హిందూ శాస్త్రాల్లో కాని, గ్రంధాలలో కాని ఎక్కడా భగవంతుడిని చేరుకోవడానికి, పరమాత్మ ని తృప్తి పరచడానికి అమాయక ప్రాణుల రక్తాన్ని చిందించాలి అనేది లేదు. హిందూ ధర్మం లోనే కాదు, ప్రపంచం లోని చాలా ధర్మాలలో, మతాలలో జంతు బలిని సమర్ధించలేదు. ధర్మం కాని, మతం కాని మనిషి ని శాంతం గా, సంతోషం గా, తృప్తి గా ఉంచుతూ - ప్రకృతి లోని ఇతర జీవాలతో ఎలా అనుసంధానం అవ్వాలో చెప్పాయి కాని - ప్రకృతి లోని ఇతర ప్రాణుల మనుగడ ని దెబ్బ తీస్తూ ధర్మాచరణం చెయ్యమని ఎక్కడా చెప్పలేదు.
మతం పేరుతో జరిగే హింస ఎక్కడ అయినా, ఎప్పుడు అయినా, ఎలాంటి సందర్భం లో అయినా వ్యతిరేకించవలసిన విషయమే. అందులోను వేదోపనిషత్తులతో, గీత లాంటి బోధనలతో, అహింసా సిద్ధాంతం తో ప్రపంచ మానవాళికి వెలుగులు పంచిన భారత దేశ ధార్మిక జీవనానికి ఆయువు పట్టయిన హిందూ ధర్మం పేరుతో ఎక్కడ హింస జరిగినా అది - హేయం అయినది, క్షమించరానిది.
ఈ సున్నితమైన అంశం గురించి నేను సాగిస్తున్న శోధన, పోరాటాల ఫలితమే - ఈ నా రచన.
దురదృష్టం కొద్దీ, హిందూ ధర్మం లో చెప్పబడిన అంశాలు చాలా వరకు తప్పు గా అర్థం చేసుకోబడ్డాయి లేదా స్వార్ధ పరుల చేతుల్లో అవి వక్రీకరించ బడ్డాయి. వాటి ఫలితమే మనం ఈ నాటికీ అతి సాధారణం గా చూస్తున్న జంతు బలులు. హిందూ శాస్త్రాల్లో కాని, గ్రంధాలలో కాని ఎక్కడా భగవంతుడిని చేరుకోవడానికి, పరమాత్మ ని తృప్తి పరచడానికి అమాయక ప్రాణుల రక్తాన్ని చిందించాలి అనేది లేదు. హిందూ ధర్మం లోనే కాదు, ప్రపంచం లోని చాలా ధర్మాలలో, మతాలలో జంతు బలిని సమర్ధించలేదు. ధర్మం కాని, మతం కాని మనిషి ని శాంతం గా, సంతోషం గా, తృప్తి గా ఉంచుతూ - ప్రకృతి లోని ఇతర జీవాలతో ఎలా అనుసంధానం అవ్వాలో చెప్పాయి కాని - ప్రకృతి లోని ఇతర ప్రాణుల మనుగడ ని దెబ్బ తీస్తూ ధర్మాచరణం చెయ్యమని ఎక్కడా చెప్పలేదు.
మతం పేరుతో జరిగే హింస ఎక్కడ అయినా, ఎప్పుడు అయినా, ఎలాంటి సందర్భం లో అయినా వ్యతిరేకించవలసిన విషయమే. అందులోను వేదోపనిషత్తులతో, గీత లాంటి బోధనలతో, అహింసా సిద్ధాంతం తో ప్రపంచ మానవాళికి వెలుగులు పంచిన భారత దేశ ధార్మిక జీవనానికి ఆయువు పట్టయిన హిందూ ధర్మం పేరుతో ఎక్కడ హింస జరిగినా అది - హేయం అయినది, క్షమించరానిది.
ఈ సున్నితమైన అంశం గురించి నేను సాగిస్తున్న శోధన, పోరాటాల ఫలితమే - ఈ నా రచన.
Subscribe to:
Posts (Atom)